Advertisement

పంట కాలువకు అడ్డుగోడ నిర్మాణంపై స్పందించిన మంత్రి నిమ్మల కాంట్రాక్టర్, అధికారిపై కేసు

మన పత్రిక: పంట కాలువకు అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టిన ఘటనపై జలవనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన కాంట్రాక్టర్ తో పాటు సంబంధిత ఆర్ అండ్ బీ అధికారిపై కేసు నమోదు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

కోనసీమ జిల్లా పరిధిలోని ఓ పంట కాలువకు అడ్డంగా గోడ నిర్మించారని బాధిత రైతులు నేరుగా మంత్రి నిమ్మల రామానాయుడుకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఉత్తర్వుల మేరకు అధికారుల ఫిర్యాదుతో అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ అధికారిపై కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement