Advertisement

రూ. 4.25 లక్షలకు కొన్న బంగళా ఇప్పుడు రూ. 450 కోట్ల ఆస్తిగా మారిన వైనం

మన పత్రిక: ప్రముఖ సీనియర్ నటుడు Jeetendra ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో రూ. 4.25 లక్షలకు కొనుగోలు చేసిన బంగళా, కాలక్రమంలో రూ. 450 కోట్ల విలువైన ఆస్తిగా మారింది. ‘ది రియాలిటీ డ్రైవ్’ అనే కార్యక్రమంలో జితేంద్ర ఈ విషయాలను వెల్లడించారు. గిర్ గామ్ లోని ఒక చిన్న చావుల్ గదిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కలిసి జీవించిన తనకు, పాలి హిల్‌లో బంగళా కొనుగోలు చేయడం ఒక గొప్ప విషయమని ఆయన చెప్పారు.

ఆనాటి ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఈ పాలి హిల్ బంగళాను అమ్మకానికి పెట్టారు. తన తండ్రి సలహాతో జితేంద్ర రూ. 4.25 లక్షలకు ఆ సమయానికి దానిని కొనుగోలు చేశారు. ఆ బంగళాతో పాటు 3,450 చదరపు అడుగుల స్థలం కూడా వచ్చింది. అయితే ఆ ఇంటికి మారిన తర్వాత జితేంద్ర నటించిన నాలుగు సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో, ఆ బంగళా తమకు కలిసిరావడం లేదని భావించి ఆయన కుటుంబం అక్కడి నుండి వేరే ప్రదేశానికి మారిపోయింది.

Advertisement

ఆ తర్వాత ఆ బంగళాను పునర్నిర్మించాలని జితేంద్ర నిర్ణయించుకున్నారు. పాత భవనాన్ని కూల్చివేసినప్పుడు అందులోని బర్మా టేకు విక్రయించడం ద్వారానే ఆయనకు రూ. 11.5 లక్షలు లభించాయి. అంటే బంగళా కొనుగోలు చేసిన ధర కంటే కేవలం టేకు ద్వారానే ఎక్కువ మొత్తం రావడం విశేషం. అనంతరం ఆ స్థలంలో నర్గీస్ దత్ రోడ్‌లో ‘గౌతమ్ అపార్ట్‌మెంట్స్’ నిర్మించారు. ఆ సమయంలో భయంతో చదరపు అడుగు రూ. 85 చొప్పున ఫ్లాట్లను త్వరపడి విక్రయించినట్లు జితేంద్ర తెలిపారు. ప్రస్తుతం అక్కడ చదరపు అడుగు రూ. 85,000 వరకు ఉం‍దని ఆయన కుమారుడు తుషార్ కపూర్ పేర్కొన్నారు.

Advertisement