Advertisement

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ

మన పత్రిక: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది.

ఈ సమావేశంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల కోసం భూ కేటాయింపులు చేపట్టడం వంటి కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement