మన పత్రిక, తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురైంది. నిత్యం వందలాది మంది భక్తులు పూజించే ఈ ప్రాచీన విగ్రహం అక్కడ కనిపించకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. విగ్రహం లేని చోట భక్తులు నమస్కరించుకుంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి విగ్రహాన్ని కాషాయ గుడ్డలో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఎటువైపు వెళ్లాడనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని విగ్రహాన్ని పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలో నిరసనల సెగ: 16 మెట్రో స్టేషన్లు మూసివేత
- న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- నర్సాపూర్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును విచారించిన మెజిస్ట్రీరియల్ టీమ్
