మన పత్రిక, కొడంగల్: తెలంగాణలో తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేకనే బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు తనపై కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరైనా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే వారి ఏకైక లక్ష్యమని ఆయన మండిపడ్డారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై కొడంగల్లో జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పేదలకు మేలు చేసేందుకు తాను రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్లో తనను రాజకీయాత్మకంగా దెబ్బతీస్తే రాష్ట్రస్థాయిలో నిలువరించవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్లో ఇప్పటికే 78 శాతం ఓట్ల నమోదు పూర్తయిందని, మిగిలిన 22 శాతం అర్హులైన వారిని ఈ నెలాఖరు నాటికి నమోదు చేయించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే సంక్షేమ పథకాలు అందవని, ప్రతి ఒక్కరూ సరైన ఆధారాలతో నమోదు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
