మన పత్రిక, వెబ్డెస్క్
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా నిర్వహించనున్నారు. సర్పంచ్ పదవీకాలం 2026 ఏప్రిల్ తో ముగియనుండడంతో, ఎన్నికల ప్రక్రియను ముందస్తుగా ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు. అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. నవంబర్ 30లోపు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్ల కేటాయింపు పూర్తి చేయాలి.
Advertisement
2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని ప్రీ-ఎలక్షన్ షెడ్యూల్ సూచిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాశారు. సమయపాలనతో ఎన్నికల ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
