మన పత్రిక, న్యూఢిల్లీ: భారత సైన్యంలో (Indian Army) పనిచేయాలనుకునే యువత కోసం 350 టెక్నికల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగాల్లో బీఇ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష లేకుండా, కేవలం అత్యంత పారదర్శకంగా జరిగే ఇంటర్వ్యూల (SSB Interview) ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2027 నాటికి 20 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన వారు ఆగస్టు 7 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఆర్మీ నిబంధనల ప్రకారం తొలి నెల నుంచే రూ. 1.50 లక్షల వరకు వేతనం లభిస్తుంది.
Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
