మన పత్రిక, వెబ్డెస్క్
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం(Chandrugonda), బెండాలపాడు గ్రామానికి విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్లో చేరుకున్న సీఎం, ఇందిరమ్మ ఇండ్ల పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇద్దరు గిరిజన మహిళా లబ్ధిదారుల ఇళ్లకు గృహప్రవేశం చేయించి, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించనున్నారు.
సాయంత్రం 3:15 నుండి 4:15 గంటల వరకు దామరచర్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. సాయంత్రం 4:20 గంటలకు ఆయన హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
