WhatsApp

BTech Student Died : ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు ఢీకొని యువతి మృతి

btech student dies after being hit by train in nellore

BTech Student Died : ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు రావడం గమనించకపోవడంతో.. రైలు ఢీకొని బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ హవిలా షారూన్ అనే బీటెక్ విద్యార్థిని పట్టాలు దాటుతోంది. అదే సమయంలో కాన్పూర్ – బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రూట్ లో వెళ్తోంది. విద్యార్థిని ఆ రైలును … Read more

Auto Driver : ఒకే ఆటోలో 23 మంది స్కూలు పిల్లలు.. సీజ్ చేసిన పోలీసులు

auto driver transports 23 school children in single auto

Auto Driver : ఒక్క ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తారు చెప్పండి. చిన్న ఆటో అయితే అతి కష్టం మీద ఐదుగురు, పెద్ద ఆటో అయితే 10 మంది వరకు ప్రయాణిస్తారు. కానీ.. ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన ఆటోలో ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులను కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు. నాగర్ కర్నూల్ పట్టణం కేంద్రంలో ఆటోలో 23 మంది పిల్లలకు తీసుకెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆటోను అడ్డుకొని పిల్లలను దింపేసి ఆటోను సీజ్ చేశారు. పసి … Read more

Last rites : హృదయ విదారక ఘటన.. కొడుకు అంత్యక్రియలకు డబ్బులు లేక ఏడుస్తూ కూర్చున్న తండ్రి

father cries for unable to perform last rites of his son

Last rites : మహబూబ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుక్కి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ తండ్రి. బతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోయాను.. అని బాలరాజ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ లో ఉన్న పత్తి మిల్లులో పని చేస్తున్న బాలరాజ్ కు భార్య, ఇద్దరు కొడుకులు. ఇటీవల పత్తి మిల్లు మూతపడటంతో … Read more

Vemuri Kaveri Travels : వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు

fire accident to vemuri kaveri travels bus in rangareddy

Vemuri Kaveri Travels : కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘటన మరవకముందే అదే ట్రావెల్స్ కు చెందిన మరో బస్సులో పొగలు వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఫ్లైఓవర్ పై చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత బస్సులో పొగలు రావడం ప్రారంభమయ్యాయి. బస్సు ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు అది. రాత్రి పూట బస్సులో పొగలు రావడంతో … Read more

Maoist Hidma Encounter : మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్

Maoist Top Leader Hidma Encounter in mareumilli

Maoist Hidma Encounter : మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా హతమయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Chain Snatching : పట్టపగలే హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్

chain snatching in tunkunta Hyderabad

Chain Snatching : హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంట రోడ్డుపై ఈ ఘటన జరిగింది. తూంకుంట రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు దగ్గరగా బైక్ పోనిచ్చి ఆమె మెడలోని గొలుసును లాక్కొని పరారయ్యారు. వెంటనే తేరుకున్న ఆ మహిళ వాళ్ల వెంట పరిగెత్తినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన పక్కనే ఉన్న మెడికల్ … Read more

SS Rajamouli : గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్.. ఎస్ఎస్ రాజమౌళిపై కేసు నమోదు

Rashtriya Vanarasena Files Complaint Against SS Rajamouli

SS Rajamouli : ఇటీవల హైదరాబాద్ లో గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న మూవీ వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఈ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి హనుమాన్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన.. ఆయనపై కేసు పెట్టింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ … Read more

Disqualified MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ రిలీజ్

Telangana speaker releases inquiry schedule for disqualified mlas

Disqualified MLAs : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ ను తెలంగాణ స్పీకర్ విడుదల చేశారు. ఈనెల 19, 20 వ తేదీల్లో మిగిలిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఈనెల 19వ తేదీన తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, 20 వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించనున్నారు.

Pista House – Shah Ghouse : పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లపై ఐటీ రైడ్స్

it raids at pista house and shah ghouse

Pista House – Shah Ghouse : హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ హోటళ్లు అయిన పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి నగరంలో ఉన్న అన్ని బ్రాంచులకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లపై ఒకేసారి ఐటీ రైడ్స్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి హోటళ్లు, హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Husband Suicide : చికిత్స పొందుతూ 8 నెలల గర్బిణీ మృతి.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

husband commits suicide after pregnant wife dies in shamsabad

Husband Suicide : 8 నెలలు నిండిన ఓ గర్బిణీ నొప్పి తట్టుకోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో అది తట్టుకోలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అందులోనూ తన భార్య కడుపులో ఉన్నది కవల పిల్లలు. కవలలు జన్మిస్తారని ఎంతో ఆశపడ్డ ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్న విజయ్.. ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లో నివాసం … Read more